మహానటి సావిత్రి జీవిత కథతో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా మహానటి.తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని బయోపిక్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
దిగ్గజ నటులు, దర్శకులు కూడా ఈ సినిమాలో కీర్తి నటన చూసి సావిత్రిని గుర్తు చేసిందని కితాబు ఇచ్చేశారు.ఇక ఉత్తమ నటిగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ జాతీయ అవార్డు సైతం అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక ఈ సినిమా చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆ కథ, కథనం, కీర్తి నటనకి ఫిదా అయిపోతున్నారు.
బాలీవుడ్ అందాల భామ దీపికా పడుకునే తాజాగా మహానటి సినిమా చూసిందట.
చూడటమే కాదు ఆమెకు సినిమా బాగా నచ్చడంతో వెంటనే మహానటి సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటె వెంటనే చూడండి అంటూ పోస్ట్ పెట్టింది.దాంతో మహానటి పోస్టర్ ని కూడా షేర్ చేసింది.
డైరక్టర్ నాగ్ అశ్విన్ తెల్లవారుఝామునే దీనిని చూసి ఒక కూల్ నోటిఫికేషన్ తో నిద్ర లేచా అంటూ కామెంట్ పెట్టాడు.మొత్తానికి దీపికా పోస్ట్ ద్వారా ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులని కూడా కచ్చితంగా ఆకట్టుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.