బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొనే మరియు రణ్వీర్ సింగ్లు ఇండస్ట్రీలోని ముచ్చటైన జంటగా పేరొందారు.వీరి పెళ్లి తరువాత అటు వ్యక్తిగత జీవితాన్ని సాఫీగా గడపడమే కాకుండా సినిమాల్లోనూ రెట్టింపు వేగంతో దూసుకుపోతున్నారు.
సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరు సమయం గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడమైనది.
ఈ నేపథ్యంలో సినీ రంగానికి చెందిన అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.ఈ క్రమంలో దీపికా పదుకొనే తన భర్త రణ్వీర్ సింగ్ గురించి ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసింది.
ప్రస్తుతం తన భర్త ఇళ్లు దాటి బయట కాలు పెట్టడం లేదని, ఇక రోజులో 20 గంటలు కేవలం నిద్రకే కేటాయిస్తున్నాడని తెలిపింది.
తన భర్త తనను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందని ఆమె సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.
అయితే తనకు ఇండియన్ వంటలు నేర్చుకోవాలని ఉందని, తన భర్తకు తన చేతితో చేసి పెట్టాలని ఉందని చెప్పుకొచ్చింది.