ఒకప్పుడు హీరోయిన్ ల పారితోషికాలు పెద్దగా ఉండేవి కావు.ఎక్కువగా హీరో లకే రెమ్యునరేషన్ అనేది ఎక్కువగా ఉండేది.
అయితే హాలీవుడ్ లో మాత్రం హీరోయిన్స్ కు కూడా భారీ గానే రెమ్యునరేషన్ అనేది అందిస్తూ ఉంటారు.కానీ టాలీవుడ్,బాలీవుడ్ లలో మాత్రం హీరోయిన్స్ కు పెద్దగా ఏమీ పారితోషకాలు ఉండేవి కావు.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.హీరోయిన్స్ కు కూడా భారీ పారితోషకాలు అందిస్తున్నారు.
ఈ పారితోషకాల విషయంలో హీరోయిన్స్ మంచి పోటీ పడుతున్నారు.అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఏకంగా 14 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.
ఎదో సినిమా లో హీరోయిన్ గా కాదు ఒక్క 15 నిమిషాలు చిత్రంలో కనిపించేందుకు ఈ భారీ ఇంత భారీ మొత్తంలో పారితోషికం అడిగిందట.
కపిల్ దేవ్ జీవితం ఆధారంగా 83 సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ తో పాటు, దీపికా పదుకొనె కూడా నటిస్తోంది.దీపికా పాత్ర కేవలం 15 నిముషాలు మాత్రమే ఉంటుందట.ఈ చిన్న పాత్ర కోసం ఆమె ఏకంగా రూ.14 కోట్ల రూపాయలు తీసుకుంటోంది.మరోపక్క నిర్మాతలు కూడా ఏమాత్రం ఆశ్చర్యానికి గురికాకుండా దీపికా పదుకొనె సినిమాలో ఉంటె చాలు.మార్కెట్ చేసుకోవచ్చు అంటూ ఆమెకు అంత మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యారట.
నిజంగా ఒక్క 15 నిమిషాల కోసం 14 కోట్లు డిమాండ్ చేసిందంటే, పూర్తి చిత్రం కోసం ఈ భామ మరి ఎంత డిమాండ్ చేస్తుందో చూడాలి.