గత ఏడాది ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలకు, ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా.ప్రపంచదేశాలకు కంటికి కనిపించని శుత్రువుగా మారింది.ఈ శుత్రువును అంతం చేసేందుకు ప్రపంచదేశాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి.ఇప్పటికీ చేస్తునే ఉన్నాయి.
అయినప్పటికీ కరోనా అదుపులోకి రావడం లేదు.
ఇక ఈ కరోనా దెబ్బకు చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి.
అన్ని వ్యాపారాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.ఇదిలా ఉంటే.
కరోనా వల్ల పొగ తాగే పొగరాయుళ్లకు ఓ మంచి జరిగిందని చెప్పాలి.పొగ తాగడం వల్ల ఎంత డేంజరని తెలిసినా.
వారు మాత్రం ఆ అలవాటును మానుకునేవారు కాదు.
కానీ, ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా వైరస్ పొగతాగేవారిపై ఎక్కువ ప్రభావం చూపింస్తుందని ఇటీవల పరిశోధనలో తేలింది.పొగతాగే వారికి కరోనా సోకే అవకాశం 14 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.ధూమపానం చేసే వారిలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వారిలో వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువని స్పష్టం చేశారు.
దీంతో పొగ తాగితే ఎక్కడ కరోనా వస్తుందో అన్న భయంతో.ఆ అలవాటును మానుకుంటున్నారట.ఫౌండేషన్ ఫర్ స్మోక్- ఫ్రీ వరల్డ్ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.కరోనాకు భయపడి భారత్లో 72% మంది పొగ తాగడం మానేయాలని డిసైడ్ అయ్యారట.
అయితే వారిలో దాదాపు 66% మంది మానేశారట.ఏదేమైనా ఎవరి మాటలు లెక్కచేయని పొగరాయుళ్లు కరోనా దెబ్బకు మారారన్నమాట.