సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులను అన్యాయం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు శనివారం ఉదయం నుండి ఆందోళన చేపట్టి,కాంటా మిషన్లు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.అంతటి ఆగకుండా రాత్రి వరకు ఆందోళన కొనసాగించడంతో స్పదించిన జిల్లా కలెక్టర్ టి.
వినయ్ కృషారెడ్డి మార్కెట్ యార్డ్ ను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించి,మద్దతు ధరతో కొనుగోలు చేస్తారని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విమరమించారు.
కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం వ్యవసాయ మార్కెట్ లో ఉదయం ఏడు గంటలకే మద్దతు ధరతో కాంటాలు ప్రారంభించడంతో ప్రశాంతంగా ధాన్యం ఎగుమతులు జరుగుతున్నాయి.పెరిగిన ధరలతో కొనుగోళ్లు జరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.