ఏపీ సీఎం వైఎస్ జగన్ డిసెంబర్ నెల నుండి జనంలోకి వెళ్లే కార్యక్రమాలు చేపట్టడానికి రెడీ అయ్యారు.స్పందన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో అధికారులతో ఈ విషయం తెలియజేశారు.
జిల్లాల వారీగా చేపట్టనున్న ఈ కార్యక్రమంలో విలేజ్ వార్డ్ సచివాలయలను సందర్శించనున్నట్లు.స్పష్టం చేశారు.
ఈ క్రమంలో అలసత్వం ప్రదర్శిస్తే వారిపై చర్యలు తీసుకునే రీతిలో ముఖ్యమంత్రి జగన్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది.
ఇదే క్రమంలో వచ్చే నెల నుండి ఎమ్మెల్యేలు నెలకు 4 సచివాలయాలను సందర్శించాలని జగన్ ఆదేశించడం జరిగింది.
ప్రతి నెల చివరి శుక్రవారం శనివారం సిటిజన్ ఔట్ రిజ్ కార్యక్రమం చేపట్టనున్నట్లు… పేర్కొన్నారు.మొత్తంమీద చూసుకుంటే రెండున్నర సంవత్సరాల పాటు.పాలన కే పరిమితమైన జగన్ ఇప్పుడు జనంలోకి వెళ్లటం చూస్తుంటే… జనం యొక్క ఫీడ్బ్యాక్.తీసుకోవడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
నేరుగా వారితో ముఖాముఖిగా మాట్లాడటానికి రెడీ అయినట్లు వారి సమస్యలు తెలుసుకోవటానికి అక్కడికక్కడే పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీలో టాక్.కింది స్థాయి నుండి క్షేత్రస్థాయిలో ఉండే ఇబ్బందులను తొలగించడానికి.
జగన్ రెడీ అయినట్లు అర్థమవుతుంది.