నందమూరి కుటుంబానికి ఏమైంది.ఇన్ని ఆత్మహత్యలు, అసహజ మరణాలు సంభవిస్తున్నాయి.
కొంతమంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటే మరి కొంతమంది అదృష్టవశాత్తు బ్రతికి బయటపడుతున్నారు.నందమూరి అభిమానులైతే ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలింది అని అనుకుంటున్నారు.మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన ఒక ఆరు సంఘటనలు కచ్చితంగా తెలుసుకోవాల్సినవి.
ప్రమాదాలు
నందమూరి కుటుంబాన్ని ప్రమాదాలు విడటం లేదు.జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీకి ప్రచారం చేస్తూ తొలిసారి ప్రమాదానికి గురి అయ్యారు.ఆ ప్రమాదం వారి నుంచి ఎలా కూడా బయటపడి మంచంపై ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే నందమూరి తారక రామారావు కుమారుడైన రామకృష్ణ సైతం ప్రమాదానికి గురయ్యాడు.అతడు కూడా లక్కీగా కొన్ని గాయాలతో బయటపడ్డాడు.
ప్రమాదపు చావులు
ఇక ఎన్టీఆర్ కుటుంబంలో నాలుగేళ్ల కాలంలో రెండు మరణాలు సంప్రదించాయి అవి కేవలం ప్రమాదాల వల్ల జరగడం విశేషం.నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడైన జానకి రామ్ ఢీకొని అక్కడికక్కడే మరణించారు.ఇక ఆ తర్వాత హరికృష్ణ సైతం ఒక ప్రమాదంలో అక్కడికక్కడే కన్ను మూశారు.
ఆత్మహత్యలు
నందమూరి తారక రామారావు మనవరాలు కుముదిని పెళ్లి అయ్యాక భర్త వేదింపులు భరించ లేక ఆత్మహత్య చేసుకొని మరణించింది.ఆ తర్వాత గత ఏడాది ఎన్టీఆర్ చిన్న కుమార్తె గత ఏడాది మానసిక సమస్యలతో ఉరి వేసుకొని కానీ మూసింది. ఈ సమయంలో ఉమ మహేశ్వరి ఘటన తెలిసి అందరు షాక్ కి గురయ్యారు.
ఎన్టీఆర్ కి పుత్ర శోకం
ఇక ఎన్టీఆర్ తొలి కుమారుడు అయిన రామ కృష్ణ చిన్న వయసులోనే మసూచి వ్యాధితో కన్ను మూశాడు.ఆయన మరణం నుంచి కోలుకోవడానికి ఎన్టీఆర్ కి చాలా సమయం పట్టింది.ఇప్పుడు తారక రత్న ఇలా చిన్న వయసులో గుండెపోటుకు గురై మరణించడం అభిమానులతో పాటు కుటుంబాన్ని కూడా ఎంతో మానసిక వేదనకు గురిచేసింది.
ఇలా వరస మరణాలు సంభవించడం మాత్రమే కాదు చాలా అసహజంగా వీరి మరణాలు జరగడమే అభిమానులను కలవడానికి గురిచేస్తుంది.