సిరియా తీరంలో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.సముద్రంలో 150 మంది వలసదారులతో లెబనాన్ వెళ్తున్న పడవ బోల్తా పడింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 94 మంది మృత్యువాత పడ్డారు.ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
నిన్న మధ్యాహ్నం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో 20 మందిని ప్రాణాలతో రక్షించారు అధికారులు.
మృతుల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.