ప్రస్తుత కాలంలో ఎన్నో మీడియా సంస్థలు తమ సంస్థలకు అత్యధిక రేటింగ్ రావాలన్న ఉద్దేశంతో లేనిపోని వార్తలను ఊహించి చెప్పడం సర్వసాధారణం అయింది.అయితే వారికి సంబంధించిన విషయాలను గురించి చెబితే ఏ విధమైనటువంటి సమస్య ఉండకపోయినా.
ఏకంగా ఫలానా నటుడు లేదా నటి మృతి చెందారని, ఇండస్ట్రీ మొత్తం తీవ్ర విషాదంలో ఉందనే వార్తలు ఎక్కువగా వింటూనే ఉన్నాం.ఈ క్రమంలోని ఈ విధమైనటువంటి వార్తలపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ మేము బ్రతికే ఉన్నాము అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కేవలం మీడియా తన స్వార్థపూరితమైన పనుల కోసం ఇలా బ్రతికి ఉన్న ఎంతోమంది నటీనటులను చంపేస్తున్నారంటూ పలువురు ఆరోపించారు.ఇప్పటి వరకు ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ తాజాగా జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరిని చంపేస్తూ ఐసీయూలో ఉన్నటువంటి ఒక ఫేక్ ఫోటోను.
మిక్స్ చేసి తంబ్ నెయిల్ పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఎంతో దారుణానికి పాల్పడ్డారని వాపోయారు.
ఈ క్రమంలోనే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.ఈ విధమైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ డబ్బు సంపాదించుకున్న మిథున్ టాకీస్ యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా బ్రతికుండగానే ఒక నటుడిని చంపేయడంతో బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి స్పందిస్తూ సదరు యూట్యూబ్ ఛానల్ పై తీవ్రస్థాయిలో మండిపడింది.
ఈ క్రమంలోనే అషు రెడ్డి తన ఫాలోవర్స్ ను, తన మిత్రులను ఈ ఛానల్ పై రిపోర్ట్ చేయాలంటూ స్క్రీన్ షాట్ తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అమర్ మరణించారన్న వార్త తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.