చాలామందికి జంతువులు అంటే చాలా ఇష్టం.పలు రకాల జంతువులను పెంచుకుంటారు.వాటికి ఏమైనా హాని కలిగితే తట్టుకోలేక పోతారు.వాటికి ఏదైనా అనారోగ్యం కలిగితే ఖర్చులకు వెనుకాడకుండా మరి వాటిని కాపాడుకుంటారు.ఇలాగే ఓ చోట ఓ వ్యక్తి తన గేదె పై ఉన్న ప్రేమతో దశదిన చేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇటీవలే ఓ కుటుంబం తన పెంపుడు పిల్లి కి సీమంతం చేసిన విషయం అందరికి తెలిసిందే.
కాగా యూపీలోని మహమ్మద్ షాకిస్త్ గ్రామానికి చెందిన సుభాష్.తను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తాడు.కాగా అతను 32 ఏళ్లు ఓ గేదెను పెంచుకునే వాడు.కాగా ఇటీవలే అది అనారోగ్యంతో మృతి చెందింది.
ఆ గేదె కు దశదినకర్మ చేయగా దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత కొన్ని రోజుల నుంచి ఆ గేదె అనారోగ్యంతో బాధ పడగా.దాన్ని వైద్యానికి కావలసినంత ఖర్చు చేశారు.కానీ ఆ గేదెను కాపాడుకోలేక పోయాడు.
దాంతో అది మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో బాధ పడ్డారు.దానికి శాస్త్రీయ బద్ధంగా అంత్యక్రియలు జరిపించారు.
కాగా ఇటీవలే అది చనిపోయి 10 రోజులు కావడంతో దానికి దశదినకర్మ చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు దశ దిన కర్మ లో పాల్గొన్న గా ఆ గేదె కు నివాళులు అర్పించారు.
ఆ కుటుంబం గ్రామస్తులందరికీ గేదె ఆత్మ శాంతి కోసం అన్నసంతర్పణ చేశారు.కాగా ఆ గేదె ను పెంచుకున్న వ్యక్తి సుభాష్ మాట్లాడుతూ.ఆ గేదె మా ఇంట్లో మా కుటుంబంలో ఒకరిగా ఉండేది.ఇప్పుడది లోకాన్ని విడిచి వెళ్ళినందున శాస్త్రీయ పద్ధతిగా కర్మకాండలు చేశామని తెలిపారు.