టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, కన్నడ కుట్టి రష్మిక మందన కలిసి నటించిన గీతాగోవిందం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
దీంతో వారు మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో కలిసి నటించారు.ఈ సినిమా రిలీజ్కు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
అయితే సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఏం సోది రా బాబు.
అంటూ ప్రేక్షకులు ఈ సినిమాను పక్కనబెట్టేశారు.
అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిన డియర్ కామ్రేడ్ ఇప్పుడు యూట్యూబ్లో దుమ్ములేపింది.
ఏకంగా భారతదేశంలోనే ఏ సినిమా సాధించని ఫీట్తో విజయ్ దేవరకొండ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయగా, దానికి ఏకంగా 2 మిలియన్ల లైకులు వచ్చాయి.
ఒక సినిమాకు ఇన్ని లైకులు రావడం ఇండియన్ హిస్టరీలోనే ఇది తొలిసారి అంటున్నారు చిత్ర యూనిట్.
పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కాలేజీ లీడర్గా నటించాడు.
రష్మికతో విజయ్ చేసిన రొమాన్స్ యూత్ను బాగానే ఆకట్టుకున్నా, సినిమాలో దమ్ము లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.దీంతో ఈ సినిమా ఇప్పుడు ఇలాంటి అరుదైన ఘనత సాధించడంతో రౌడీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఏదేమైనా ట్రెండ్ సెట్టర్గా విజయ్ దేవరకొండ మరోసారి తన మార్క్ను వేసుకున్నాడు.