మరణం అంటే రోజు వినే పదంగా మారిపోయింది.ప్రమాదాలు, మరణాలు నిత్యం అన్నదమ్ముల్లా మసలుకొంటూ విచ్చలవిడిగా లోకాన్ని ఏలుతున్నాయి.
ఇంతటి విపత్కర పరిస్దితుల్లో క్షణం క్షణం బ్రతుకంటే భయపడుతూ బ్రతకవలసి వస్తుంది.
ఇక లోకంలో అగ్నిప్రమాదాలు, రోడ్దు ప్రమాదాలు పోటాపోటీగా చోటు చేసుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరగడం వల్ల 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారాన్ని కలిగిస్తుంది.ఈమేరకు ఢాకా, రాజ్షాహి హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో టయోటా హైఏస్ వాహనానికి నిప్పు అంటుకోగా, అందులో ఉన్న 11 మంది సజీవదహనం అయ్యారు.
కాగా బస్సును ఢీకొట్టిన తర్వాత మంటలు వ్యాపించాయని, బస్సులో ఉన్న ఆరుగురు కూడ మృతి చెందినట్లుగా సమాచారం.ఇక ఈ ప్రమాదానికి కారణం వాహనాలను ఇద్దరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడమే అని తెలుస్తుంది.
కాగా ఈ ప్రమాదంలో దహనమైన 11 మందిలో అయిదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం.