కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది.ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక పోటీలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ లు నిలిచారు.
ఈనెల 17న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగనుంది.సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని సమాచారం.
అదేవిధంగా 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.మరోవైపు భారత్ జోడో యాత్రలో ఉన్నవారి కోసం పోస్టల్ బ్యాలెట్ వినియోగిస్తున్నామని మధుసూదన్ మిస్త్రీ తెలిపారు.