ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతుంది.ఈ ప్లాస్టిక్ కారణంగా ఇప్పుడు వాతావరణ కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇది వాతావరణంతో పాటు ఈ భూమిపై బ్రతుకుతున్న అన్ని రకాల జీవరాశులని కూడా నాశనం చేస్తున్నాయి.ఇక సముద్రాలలో ప్లాస్టిక్ కి విపరీతంగా కలిపేస్తున్నారు.
దీంతో సముద్రాలలో బ్రతికే జీవరాశులు వీటి కారణంగా తమ ఉనికిని కోల్పోతున్నాయి.కొన్ని వందల సంవత్సరాలు పాటు జీర్ణం కాకుండా ఉండిపోయే ఈ ప్లాస్టిక్ ని సముద్ర జీవులు తినేసి అకారణంగా చనిపోతున్నాయి.
పర్యావరణ వేత్తలు ప్లాస్టిక్ గురించి హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు దీనిని తగ్గించే పనిలో పడ్డాయి.ఇక ప్లాస్టిక్ సముద్ర జీవులని ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నాయో తాజాగా ఓ సంఘటన బయటపెట్టింది.
స్కాట్లాండ్ బీచ్లో ఒక భారీ తిమింగలం ప్లాస్టిక్ వ్యర్థాలను మింగేయడం వల్ల చనిపోయి ఒడ్డుకు కొట్టుకువచ్చింది.నవంబర్ 28వ తేదీన స్కాట్లాండ్లోని లస్కెంటైర్ బీచ్ ఒడ్డుకు తిమింగలం కళేబరం కొట్టుకురావడంతో నిపుణుల బృందం శవ పరీక్ష నిర్వహించింది.
ఆ సమయంలో తిమింగలం పొట్టలోంచి సుమారు 100 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి వారు షాకయ్యారు.తిమింగలం మింగిన వాటిలో చేపల కోసం వేసే వలలు, తాళ్ల కట్టలు, ట్యూబ్స్, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి.13 అడుగుల పొడవైన ఈ తిమింగలం భారీ మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలను మింగేయడం వల్ల జీర్ణక్రియ ప్రభావితం కావడంతో చనిపోయినట్లు నిపుణుల బృందం తెలిపింది.దీనికి సంబందించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.