ఈ మధ్యకాలంలో జంతువుల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.తాజాగా ఓ బర్రెవల్ల దారుణం జరిగింది.
ఓ ముసలామె పగలు పని చేసి బతికేది.రాత్రి పూట హాయిగా ఆమె నిద్రపోతుండగా ఓ బర్రె ఆమె ప్రాణం తీసింది.
ఇంట్లో నిద్రపోతున్న ఆ ముసలామెపై బర్రె దాడికి యత్నించింది.కొమ్ములతో బర్రెను పొడిచింది.
దీంతో ఒక్కసారిగా ఆ ముసలామె చనిపోయింది.ఆ తర్వాత ఆ బర్రె ఆ మహిళ శవాన్ని తన కొమ్ములతో తోసింది.
అప్పుడే ఆ శవం బర్రె కొమ్ముల మధ్య చిక్కుకుపోయింది.ఉదయం బర్రె కొమ్ములకు మహిళ శవం ఉండటాన్ని గమనించి స్థానికులు షాక్ అయ్యారు.
ఈ దారుణమైన ఘటన నారాయణపేట్ జిల్లాలో చోటుచేసుకుంది.మాగనూర్ మండల కేంద్రానికి చెందిన 75 ఏళ్ల బోయ లక్ష్మమ్మ ఇంట్లో ఒంటరిగా బతుకుతోంది.
ఆమెది ఓ గుడిసె.రోజూలాగానే ఆమె ఆ రోజు రాత్రి నిద్రపోతోంది.
ఇంతలో అర్థరాత్రి సమయంలో గుడిసెలోకి ఒక బర్రె పరుగెత్తుకొచ్చింది.గుడిసెలోకి చొరబడిన ఓ బర్రె లక్ష్మమ్మను కొమ్ములతో పొడిచేసింది.
దీంతో స్పాట్ లోనే ఆమె మరణించింది.బర్రె ఆమెను పొడిచే క్రమంలో ఆమె మృతదేహం బర్రె కొమ్ముల్లోనే చిక్కుకుపోయింది.శవాన్ని బర్రె రాత్రంతా తన కొమ్ములపైనే పెట్టుకుని తిరిగింది.ఉదయం వేళ స్థానికులు ఆ బర్రెను, బర్రె కొమ్ములపై ఉన్న శవాన్ని చూసి షాక్ తిన్నారు.
లక్ష్మమ్మ మృతదేహాన్ని చూసి భయంతో టెన్షన్ పడ్డారు.కొమ్ముల మధ్య ఆమె మృతదేహం చిన్నాభిన్నమైంది.ప్రస్తుతం ఆ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.సాధారణంగా బర్రెలు ఇలా చేయడం అరుదు.వాటికి కోపం వచ్చిన సందర్భంగా లేదంటే పిచ్చెక్కిన సమయంలో ఇలా చేయడం జరుగుతుంది.బర్రె చేసిన పనికి స్థానికంగా కలకలం రేగింది.
ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది.శవంతో బర్రె తిరగడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయ్యింది.
బర్రెను చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు.