వాటర్ ట్యాంక్ లో శవం కలకలం.. నల్గొండ జిల్లాలో ఘటన

మంచినీటి వాటర్ ట్యాంక్ లో శవం( Dead Body ) కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

నల్గొండ మున్సిపాలిటీ( Nalgonda Municipality ) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో( Hindupur Water Tank ) శవం ఉన్నట్లు గుర్తించారు.అయితే గత కొన్ని రోజులుగా ఆ వాటర్ ట్యాంక్ నీళ్లనే పలు వార్డుల ప్రజలు తాగుతున్నారని సమాచారం.

ఈ క్రమంలోనే తాగునీరు తేడాగా ఉండటంతో వాటర్ సప్లై సిబ్బందిని ప్రజలు ప్రశ్నించారు.దీంతో వాటర్ ట్యాంక్ ను పరిశీలించగా సిబ్బంది శవాన్ని గుర్తించారు.

దీంతో మున్సిపాలిటీ సిబ్బందిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.మృతుడు హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీగా( Avula Vamshi ) గుర్తించారు.

Advertisement

కాగా వంశీ కనిపించడం లేదని గత నెల 24న పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు