కొంత మంది అసలు ఎలాంటి పనులు చేస్తారు అంటే ఆ పనులను చూసి అందరు ఆశ్చర్య పోవడం ఖాయం.అంత పిచ్చి పనులు ఎలా చేస్తారో.
తాజాగా జరిగిన ఒక ఘటన కూడా ఇలాంటిదే.ఈ విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
అందుకే ఈ వార్త వైరల్ అయ్యింది.అతను చేసిన పని చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు.
ఇంతకీ అతడు ఏం చేశాడా అని ఆలోచిస్తున్నారు కదూ.అంత షాక్ అయ్యే పని ఏం చేసాడంటే.నది దగ్గరకు వెళ్లి అక్కడ నిద్ర పోయాడు.చుట్టూ పక్కల వారంతా అతడు చనిపోయాడు అనుకుని పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు హుటాహుటిన ఆ నది దగ్గరకు వచ్చి అతడికి దగ్గరగా వెళ్లి చూసారు.అప్పుడే తెలిసింది అతడు బ్రతికే ఉన్నాడు అని.దీంతో పోలీసులతో పాటు స్థానికులు కూడా షాక్ అయ్యారు.
యుఎస్ లో నది మధ్యలో ఇసుక తిన్నెలపై ఒక శవం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు తెలిపారు.
పోలీసులు వచ్చి అక్కడకు బోటులో చేరుకున్నారు.అతడిని కాస్త కదలడంతో అధికారులంతా షాక్ అయ్యారు.కొద్దీ సేపటికి అతడు లేచి ఏమైంది సర్ అని అడిగాడట.దీంతో కంగు తిన్న ధికారులు అతడిని ప్రశ్నించగా.అతడు నిద్ర పోతున్నట్టు తెలిపాడట.
నది మధ్యలో బాగుందని నిద్ర పోతున్న అని చెప్పడంతో అధికారులు అతడిని తీసుకుని వెనక్కి వచ్చారు.
ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీంతో అధికారులు ఇలాంటి సాహసాలు ఎవ్వరు చేయకండి అని ట్వీట్ చేసారు.
నీటి దగ్గర ఇలాంటి సాహసాలు చేస్తే చాలా ప్రమాదమని సూచించారు.అందుకే ఎవ్వరు ఇలాంటి సాహసాలు చెయ్యకండి.