ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా వైయస్సార్ జిల్లా పర్యటనకి రెడీ అయ్యారు.ఈనెల ఏడవ తారీకు పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి.
పనులకు మరియు శంకుస్థాపనలకు.ఇంకా ప్రారంభోత్సవ కార్యక్రమాలకు జగన్ హాజరుకానున్నారు.
అనంతరం ఆరోజు రాత్రికి అక్కడే ఇడుపులపాయలు బస చేయనున్నారు.ఇక ఎనిమిదవ తారీకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద జగన్ నివాళులర్పిస్తారు.
అనంతరం గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశానికి బయలుదేరనున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో వైయస్సార్ జిల్లా ప్రభుత్వ అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్రాంగణంలో జరగబోయే వైసీపీ ప్లీనరీ సమావేశాలు రెండు రోజులు జరగనున్నాయి.ఈ ప్లీనరీ సమావేశం సాక్షిగా సీఎం జగన్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేయనున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.