జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా నిలిచిన హైపర్ ఆది పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన కామెడీ సెన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా చేస్తున్నాడు ఆది.ప్రతి ఒక్కరి ని టార్గెట్ చేస్తూ తన నోటికి వచ్చిన డైలాగులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటాడు ఆది.ఇదిలా ఉంటే హైపర్ ఆది గురించి దావుద్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ లో హైపర్ ఆది బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచే విధంగా మాట్లాడటంతో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ తరపున కొందరు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక తాజాగా మరో మోసం కింద మళ్లీ ఆది పేరు బయటపడింది.
నిజానికి హైపర్ ఆది టీమ్ లో దొరబాబు, పరదేశి లు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఇక అప్పట్లో వీళ్ళ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే ప్రతిసారి ఆది వాళ్లను టార్గెట్ చేస్తూ పంచులు వేస్తూ ఉంటాడు.ఇక దొరబాబు లాగా మరో నటుడు కూడా ఉన్నాడు.అతని పేరు దావూద్. ఈయన వెండితెరపై, బుల్లితెరపై నటిస్తూ బాగా బిజీగా ఉంటాడు.దావూద్, దొరబాబు తో కలిసి కవలలు స్కిట్ చేయించాడు ఆది.ఈ నేపథ్యంలో దావూద్ ఆ స్కిట్ లో నటించడం జీవితంలో చేసిన పెద్ద తప్పు అని తెలిపాడు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దావూద్ తాను, దొరబాబు ఒక్కరం కాదని క్లారిటీ ఇచ్చాడు.తనకు దొరబాబు కి ఎటువంటి సంబంధం లేదని బయటకు తెలిపమని హైపర్ ఆదిని చాలా సార్లు అడిగాడట.ఇక ఆది క్లారిటీ ఇస్తా అని చెబుతూ ఏవో కారణాలు చెప్పి తప్పించుకొని తిరుగుతూ మోసం చేస్తున్నాడని తెలిపాడు.తను ఏదైనా సినిమాలలో, సీరియల్ లో నటించినప్పుడు దొరబాబు కు ఫోన్ చేసి బాగా నటించేవారని అనేవారట.
దాంతో దొరబాబు కూడా థ్యాంక్స్ చెబుతున్నట్లు తనకు తెలిసిందని తెలిపాడు దావూద్.అలా చెప్పడం వల్ల తనకు బాధిస్తోందని తెలిపాడు.