విదేశాల్లో ఉన్న కొందరు దేశాద్రోహులను, ఉగ్రవాదులను మన ప్రభుత్వాలు దేశానికి రప్పించడం అసాధ్యం.తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని డంబాలు పలుకుతారు.
కానీ ఆ పని ఎన్నటికీ చేయలేరు.భారత్ ఎన్నడూ పట్టుకోలేని వ్యక్తి ఒకడున్నాడు.
అతనే పేరుమోసిన, కరడుగట్టిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం.అతను పాకిస్తాన్లో సురక్షితంగా ఉన్నాడు.
కానీ దావూద్ ఇబ్రహీం అనే పేరుగల ఉగ్రవాది తమ దేశంలో లేనేలేడని పాక్ సర్కారు చెబుతోంది.
ఒక టీవీ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో దావూద్ పాకిస్తాన్లో ఉన్నట్లు అన్ని ఆధారాలతో రుజువైంది.
అతని ఇంటి చిరునామా కూడా స్పష్టంగా తెలిసింది.కానీ పాక్ సర్కారు అతను దేశంలో లేదని అధికారికంగా చెబుతోంది.
పాకిస్తాన్లో ఏ రకమైన ప్రభుత్వం ఉన్నా దావూదును ఇండియాకు అప్పగించదని యూపీఏలో హోం మంత్రిగా చేసిన చిదంబరం చెప్పారు.స్టింగ్ ఆపరేషన్ చేసిన టీవీ ఛానల్ ప్రతినిధులు దావూద్ నివాస భవనం సెక్యూరిటీ అధికారులతో మాట్లాడారు.
వారు దావూద్ ఇక్కడే ఉన్నాడని చెప్పారు.దావూద్ పాకిస్తాన్లో హాయిగా ఉన్నాడని అన్ని ప్రపంచ దేశాలకూ తెలుసు.
కానీ ఏం ప్రయోజనం?
.