అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారతదేశాన్ని సర్వనాశనం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో భారీ మరణహోమం సృష్టించాడు.ఈ సంఘటన యావత్ భారతావనిని కలిచి వేయడంతో పాటు అసలు ముంబై వెళ్లాలంటేనే ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితి వచ్చింది.అప్పటి వరకు భారత్లోనే ఉండి బాలీవుడ్ ప్రముఖులతో మాఫియా నడిపించిన దావూద్ ఆ తర్వాత భారత పోలీసుల కళ్లు గప్పి పాకిస్తాన్కు పారిపోయాడు.
ఇక అప్పటి నుంచి కరాచీలోనే తలదాచుకుంటోన్న దావూద్ తన కుమార్తెను ప్రముఖ పాక్ మాజీ క్రికెటర్ జావెంద్ మియాందాద్ కుమారుడికి ఇచ్చి మరీ వివాహం చేశాడు.ఇక పాక్లో సీక్రెట్గా ఉన్న దావూద్ ఓ పాక్ మోడల్, సీనియర్ హీరోయిన్తో ఎఫైర్ కొనసాగిస్తున్నాడని పాక్ మీడియా చెవులు కొరుక్కుంటోంది.
ఐటెం గర్ల్గా కెరీర్ స్టార్ట్ చేసిన 37 ఏళ్ల మోహ్విష్ హయాత్తో దావూద్కు సంబంధాలు ఉన్నాయని అక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఆమెకు పాక్ అత్యున్నత పురస్కారం తమ్లా ఇంతియాస్ దక్కింది.
అసలు పాకిస్తాన్లోనే చాలా మందికి తెలియని ఆమెకు ఏకంగా పాక్ అత్యున్నత పురస్కారం దక్కడం వెనక దావూద్ బలమైన లాబీయింగ్ పనిచేసిందని కూడా టాక్ ఉంది.ఇక ఆమెతో దావూద్కు ఎఫైర్ ఉందని కూడా పాక్ మీడియా వర్గాలు పుంకాను పుంకాలుగా కథనాలు వల్లె వేస్తున్నాయి.ఇక ముంబైలో ఉండగా కూడా అప్పటి బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్లు కొనసాగించిన దావూద్ ఇప్పుడు కూడా పాక్లోనూ హీరోయిన్లతో ఎఫైర్ల ఆపలేదని తాజాగా బయటకు వచ్చింది.