ప్రస్తుతం కరోనా దేశంలో రోజు రోజుకు ఉగ్ర రూపం దాల్చుతోంది.కరోనా బారిన పడి జనం పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
మొదటి దశ కరోనా వేవ్ లో ఎంతో క్రిటికల్ గా ఉంటే తప్ప మరణింంచే పరిస్థితి ఉండేది కాదు.కాని ఇప్పుడు కరోనా సోకిన రెండు, మూడు రోజులలోనే ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నాయంటే కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు ప్రజలందరూ మానసికంగా చాలా భయాల మధ్య బ్రతుకుతున్న పరిస్థితి ఉంది.ఎక్కడ చూసినా నెగెటివిటీ ఉంది.
కరోనా రాగానే ఇక భయంతోటి చాలా మంది తనువు చాలిస్తున్నారు.ఇంత కఠిన పరిస్థితులలో ప్రజలకు కొంచెం ఊరట కలిగిస్తున్నది ఐపీఎల్ క్రికెట్ అని చెప్పవచ్చు.
ఇప్పటికే కొద్ది మంది క్రికెటర్ లు కరోనా బారిన పడడం కోలుకోవడం వంటివి జరిగిన విషయం తెలిసిందే.అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితులలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించడానికే బీసీసీఐ మొగ్గు చూపుతోంది.
అయితే క్రికెటర్ లు అందరూ పీపీఈ కిట్స్ వేసుకొని మ్యాచ్ వెన్యూ లకు బయలుదేరుతున్నారు.ఫారన్ క్రికెటర్ లు డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్ పీపీఈ కిట్స్ వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇక ఫ్యాన్స్ వీరెవరో గుర్తుపట్టండి చూద్దాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఫ్యాన్స్ కామెంట్స్ తో ఈ వీడియో ప్రస్తుతం మరింత వైరల్ గా మారింది.