కనిపెంచిన తండ్రి సంపాదించిన పెట్టిన కోట్ల విలువైన ఆస్తి కోసం ఆ కూతురు కపటనాటకం ఆడింది.తన తండ్రిని ఆస్తి రాయించుకునేంత వరకు చాలా ప్రేమగా చూసుకుంది.
ఒక్కసారి ఆస్తి తన పేరుపై మార్చుకోగానే తండ్రిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.దీంతో ఆ తండ్రి కూతురుకు అధికారుల సహాయంతో తగిన బుద్ధి చెప్పాడు.
ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగలం సమీపంలోని కరడిక్కల్ గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన వైరవన్(80)కు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు.కొడుకులిద్దరూ ఇప్పటికే మృతిచెందడంతో ఆయనను తన కూతురు చూసుకునేది.అయితే ఇదంతా కేవలం ఆయన సంపాదించిన రూ.3.87 కోట్ల విలువైన 6.37 ఎకరాల స్థలం కోసమే అని.అది ఆమెపేరుపై రాసివ్వగానే తనను పట్టించుకోవడం మానేసిందని ఆ తండ్రి వాపోయాడు.
తనకున్న కొద్దిపాటి స్థలంలో ఓ చిన్న ఇల్లు కట్టుకుని బతకసాగాడు.అయినా సహించని ఆ కూతురు ఆ ఇంటిని కూడా పడగొట్టించింది.దీంతో వైరవన్ తిరుమంగలం ఆర్డీవో మురుగన్ను ఆశ్రయించాడు.విచారణ చేపట్టిన ఆయన నిజానిజాలు తెలుసుకుని చట్టప్రకారం కూతురి పేరుపై ఉన్న స్థలాన్ని తిరిగి వైరవన్కు అప్పగించడంతో ఆ కూతురికి తగిన బుద్ధి చెప్పారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.