తండ్రిని పట్టించుకోని కూతురుకు అధికారుల ఝలక్

కనిపెంచిన తండ్రి సంపాదించిన పెట్టిన కోట్ల విలువైన ఆస్తి కోసం ఆ కూతురు కపటనాటకం ఆడింది.తన తండ్రిని ఆస్తి రాయించుకునేంత వరకు చాలా ప్రేమగా చూసుకుంది.

 Daughter Punished For Not Taking Care Of Father-TeluguStop.com

ఒక్కసారి ఆస్తి తన పేరుపై మార్చుకోగానే తండ్రిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.దీంతో ఆ తండ్రి కూతురుకు అధికారుల సహాయంతో తగిన బుద్ధి చెప్పాడు.

ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగలం సమీపంలోని కరడిక్కల్ గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన వైరవన్(80)కు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు.కొడుకులిద్దరూ ఇప్పటికే మృతిచెందడంతో ఆయనను తన కూతురు చూసుకునేది.అయితే ఇదంతా కేవలం ఆయన సంపాదించిన రూ.3.87 కోట్ల విలువైన 6.37 ఎకరాల స్థలం కోసమే అని.అది ఆమెపేరుపై రాసివ్వగానే తనను పట్టించుకోవడం మానేసిందని ఆ తండ్రి వాపోయాడు.

తనకున్న కొద్దిపాటి స్థలంలో ఓ చిన్న ఇల్లు కట్టుకుని బతకసాగాడు.అయినా సహించని ఆ కూతురు ఆ ఇంటిని కూడా పడగొట్టించింది.దీంతో వైరవన్ తిరుమంగలం ఆర్డీవో మురుగన్‌ను ఆశ్రయించాడు.విచారణ చేపట్టిన ఆయన నిజానిజాలు తెలుసుకుని చట్టప్రకారం కూతురి పేరుపై ఉన్న స్థలాన్ని తిరిగి వైరవన్‌కు అప్పగించడంతో ఆ కూతురికి తగిన బుద్ధి చెప్పారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube