నేటి సమాజంలో నానాటికి మానవ సంబంధాలు మంటకలిసి పోతున్నాయి.ఎవరికి ఎవరు కానట్లుగా ప్రవర్తిస్తున్నారు.
ఆవేశం వస్తే చాలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాలతో వారి జీవితాలనే కాదు అయిన వారి పట్ల కూడా కర్కషంగా ప్రవర్తిస్తున్నారు.
ఇలాంటి ఘటనే ఛత్తీస్ఘడ్లోని బిలాస్పూర్ జిల్లాలో జరిగింది.
బిలాస్పూర్ జిల్లా కాంచన్పూర్ గ్రామానికి చెందిన మాంగ్లు రామ్ధనుకర్(58)కు దివ్య సరస్వతి (28) అనే కుమార్తె ఉందట.
అయితే ఈమెకు వివాహమైన భర్తతో ఉన్న మనస్పర్దల కారణంగా తండ్రి వద్దే ఉంటుందట.ఈ క్రమంలో ఒకరోజు తన సెల్ఫోన్ కనిపించక పోవడంతో తండ్రి అడగ్గా, మొదట తాను తీయలేదని సమాధానమిచ్చాడట.
అయినా నమ్మకం కలగని సరస్వతి గట్టిగా అడగటంతో నీ ప్రవర్తన నచ్చకే ఫోన్ దాచినట్లు చెప్పాడట.
ఆ మాటలకు కోపంతో ఉడికిపోతూ, పట్టరాని ఆవేశంలో కర్రతో కొట్టి, రాయితో తలపై మోది తండ్రిని హతమార్చిందట.
అదీగాక ఆ శవాన్ని తల్లి సహకారంతో ఇంటి ఆవరణలో పూడ్చిందట.కొన్ని రోజులుగా మాంగ్లు కనిపించక పోవడంతో చుట్టుపక్కల వారు నిలదీయగా పొంతలేని సమాధాలు చెప్పారట.
అనుమానం కలిగిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చిందట.దీంతో నిందితులిద్దరినీ అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.