పెళ్ళైన తర్వాత అత్తామామలనే తన తల్లితండ్రులుగా భావిస్తుంది ఇల్లాలు.కోడలిని కూతురుగా చూసుకోవాల్సిన ఆ అత్తమామలు మాత్రం కోడలికి ద్రోహం చేయాలని చూసారు.
అత్తమామలే స్వయంగా కోడలి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో చోటుచేసుకుంది.అసలు ఆ అత్తమామలు ఇలా ఎందుకు చేసారో తెలియాలంటే వివరాలు చూడండి!
యువతికి వివాహమై.రెండేళ్ల కొడుకు ఉన్నాడు.దురదృష్టపుశాత్తు యువతి భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు.దీంతో.కొడుకుతో కలిసి అత్తమామల వద్ద ఉంటోంది.కొడుకు పోయాక కోడలు మాత్రం మా ఇంట్లో ఎందుకు అనుకున్నారు ఆమె అత్తమామలు.
ఆమెను వెళ్లగొట్టడానికి ప్లాన్ చేసారు.
హింసించడం మొలుపెట్టారు.తమ ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటూ బెదిరించారు.అయినా యువతి అత్తారిల్లు వదిలి వెళ్లకపోవడంతో.
ఆమె ఫోటోలను అసభ్యరీతిలో మార్ఫింగ్ చేసి.ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.తన మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫోటోలతో తన పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరచి అత్తమామలే వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.