మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాథర్ ఒకటి.ఆచార్య ప్లాప్ తర్వాత ఈ సినిమాతో మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అందుకే ఈ సినిమా విషయంలో అంతా కూడా ఫుల్ అటెన్షన్ గా ఉన్నారు.ఎందుకంటే ఆచార్య సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.
ఇక ఇప్పుడు రాబోతున్న గాడ్ ఫాదర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
మరొక పది రోజుల్లో ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.
అయినా కానీ మొన్నటి వరకు ప్రొమోషన్స్ స్టార్ట్ చేయలేదు.కానీ అనూహ్యంగా చిన్న డైలాగ్ తో మెగాస్టార్ ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేసారు.
మరి రిలీజ్ కు చిన్న గ్యాప్ ఉండడంతో అన్ని వైపులా నుండి ఈ సినిమా ప్రొమోషన్స్ చేస్తున్నారు.ఎప్పటి నుండో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు జరుగుతుంది.
ఇప్పుడు జరుగుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 28న జరగనుండగా.వెన్యూ ను అనాథపూర్ లోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో సాయంత్రం 6 గంటల నుండి స్టార్ట్ చేయనున్నట్టు పోస్టర్ ద్వారా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేయడంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్ఫ్యూజన్ తొలగి పోయింది.
ఈ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారో ఇప్పటికి బయటకు రాలేదు.
ఇక తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుంటే.సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు.
థమన్ సంగీతం అందించాడు.