టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారే లేరు.నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచిన చిరంజీవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
నిజజీవితంలో కూడా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు చిరంజీవి.సహాయం చేయడానికి వెనుకాడని వ్యక్తిగా నిలిచాడు.
ఇప్పటికే ఎంతో మందికి తన వంతు సహాయం చేసి మంచి వ్యక్తిగా నిలిచాడు.ఇదిలా ఉంటే తాజాగా ఓ కో-డైరెక్టర్ మెగాస్టార్ గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిపాడు.
ప్రముఖ కో-డైరెక్టర్ ప్రభాకర్.ఈయన దాసరి నారాయణ దగ్గర కో డైరెక్టర్ గా పని చేశాడు.ఇక తాజాగా మెగాస్టార్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.తన కూతురి చదువుకు అవసరమైన కాలేజీ ఫీజులు అందించాడని తెలిపాడు.
తను దాసరి దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన సమయంలో.చిరంజీవి నటించిన లంకేశ్వరుడు కి చేశానని తెలిపాడు.
ఇటీవలే హెల్ప్ లైన్ అనే తీయగా.దర్శకనిర్మాతగా నష్టపోయానని తెలిపాడు.
తను తీసిన సినిమా ఎవరు విడుదల చేయకపోవడంతో నష్టపోయాడట.ఇక తన అబ్బాయికి సీబీఐటీ లో ఇంజనీరింగ్ పూర్తయి రెండేళ్ల అవ్వగా.అతని సర్టిఫికెట్ కోసం డబ్బులు కట్టాలట.ఇక తన పాప బీబీఏ ఫైనల్ ఇయర్ కి వచ్చిందని.2.5 లక్షలు కడితే ఎగ్జామ్ రాయగలదని.కానీ తన దగ్గర డబ్బులు ఎంత ప్రయత్నించినా అందలేదని తెలిపాడు.ఇక వాళ్ల బాధ్యతను, భవిష్యత్తును కాపాడలేకపోతున్నందుకు తన ఇల్లు శ్మశాన వాతావరణంలా మారిందని బాధపడ్డాడట.
ఇక చివరికి చిరంజీవిని కలిశాడట.లంకేశ్వరుడు సినిమాలో ఎంతో ప్రేమగా చూసుకున్నారో.ఇప్పుడు కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడని తెలిపాడు.ఇక తన గురించి తెలపగా వెంటనే ఫీజు ఏర్పాటు చేశాడని తెలిపాడు ప్రభాకర్.చిరంజీవితో పాటు పలువురు స్టాఫ్ కూడా సహాయం చేశారని.గజేంద్ర మోక్షం లో మొసలి కి చిక్కిన గజేంద్రుని కాపాడేందుకు వచ్చిన మహావిష్ణు లా చిరంజీవి తనను ఆదుకున్నారని తెలిపాడు.
దీనివల్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు ప్రభాకర్.