దసరా పండుగ సెలవులు రావడంతో థియేటర్ల వద్ద పలు సినిమాలు ప్రేక్షకులను సందడి చేశాయి.ఈ క్రమంలోనే దసరా కానుకగా బరిలోకి దిగిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సిద్ధార్థ్, శర్వానంద్ మహాసముద్రం, శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లి సందD సినిమాలు దసరా బరిలో దిగి నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి.
అయితే దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాలు ఏ మేరకు ప్రేక్షకులను సందడి చేశాయి అనే విషయానికి వస్తే.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం సినిమాలో రావు రమేష్ అతిథి హైదరి పాత్రలు ఎంతో కీలకంగా మారాయి.
అయితే అజయ్ భూపతి స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ అయ్యింది.ఈ సినిమా సూపర్ హిట్ అనిపించకపోయినా పరవాలేదని పెంచుకుని సరిపెట్టుకుంది.అలా ఎన్నో ఆశలతో విడుదలైన మహా సముద్రం సినిమా తీరం తాకలేదనే చెప్పవచ్చు.ఇకపోతే అఖిల్ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఇందులో అఖిల్ పూజ యాక్టింగ్ సూపర్ అనిపించినప్పటికీ భాస్కర్ స్క్రిప్టులో మాత్రం కొద్దిగా అవకతవకలు ఏర్పడ్డాయి. అఖిల్ మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పరవాలేదనిపించిన్నప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమా ఓపెనింగ్స్ రాలేదని చెప్పవచ్చు.క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు పూర్ రేటింగ్ ఇచ్చారు.మొత్తానికి దసరా బరిలో దిగిన ఈ మూడు సినిమాలలో మహా సముద్రం పరవాలేదనిపించిందని చెప్పవచ్చు.