న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.
శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.ఈ సినిమా తర్వాత నాని అంటే సుందరానికి సినిమా చేసాడు.
ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేక పోయింది.
ఇక నాని ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు.కానీ ఇప్పుడు మాత్రం ఊర మాస్ లుక్ లోకి వచ్చి మాస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.
ప్రెసెంట్ నాని శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు.
గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో మరొక విభిన్న పాత్ర పోషించ నున్నట్టు తెలుస్తుంది.ఇప్పటి వరకు నాని ని చూడని కొత్త లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.
ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి.
మరి ఈ వార్తలను తాజాగా డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా ఖండించారు.ఈ రూమర్స్ పై ఈయన గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న దసరా సినిమా బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయిందని.త్వరలోనే మళ్ళీ సెట్స్ మీదకు వెళ్లనుందని ఒక నెటిజెన్ ట్వీట్ చేసాడు.
ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ డైరెక్టర్ శ్రీకాంత్ బ్రహ్మి క్లిప్ ఒకటి పోస్ట్ చేసి గట్టి కౌంటర్ ఇచ్చాడు.ఈయన ఈ పోస్ట్ చెయ్యడంతో ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయింది.
దీంతో నాని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.