మనకు చాలా వ్యాధులకు సంబంధించిన వివరాల తెలుసు.అయితే ఉన్నట్టుండి మనిషి శరీరంలోని ఒక అవయమం మాయమయ్యే వ్యాధి గురించి ఎప్పుడూ వినివుండరు.
డారెన్ ఫెర్గూసన్ అనే వ్యక్తి లండన్లో నివసిస్తున్నాడు.ఈ వ్యక్తి అరుదైన వ్యాధి బారిన పడ్డాడు.
దీంతో అతని మూత్రపిండాలు మళ్లీ మళ్లీ అదృశ్యమవుతుంటాయి.అందుకే ఇప్పుడు ఈ వ్యక్తిని ఆరు కిడ్నీలున్న వ్యక్తిగా గుర్తిస్తున్నారు.
డేరన్ చిన్నప్పటి నుండి కిడ్నీ ఫెయిల్యూర్ బాధితుడు.దీంతో అతడి కిడ్నీని ఇప్పటికే 5 సార్లు మార్పిడి చేశారు.
అతనికి ప్రతి 4-5 సంవత్సరాలకు కిడ్నీని మార్చవలసి ఉంటుంది.ఇది మాత్రమే కాదు.
ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.డారెన్ కిడ్నీని మార్పిడి చేసినప్పుడల్లా వైద్యులు.
అతని పాత కిడ్నీని బయటకు తీయలేరు.అతని కిడ్నీ దానంతట అదే మాయమైపోతుందని వైద్యులు తెలిపారు.
డెరన్ గత 37 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాఢపడుతున్నాడు.డారెన్.ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఈ తీవ్రమైన వ్యాధి వచ్చింది.డారెన్ కిడ్నీ బ్లాక్తో పుట్టాడు.
దీంతో అతని కిడ్నీ ఫెయిల్ అయింది.డారెన్ కిడ్నీని ఐదేళ్ల వయసులో మాత్రమే మార్పిడి చేశారు.11 సంవత్సరాల తర్వాత.డారెన్ మళ్లీ కిడ్నీ మార్పిడి చేయించుకోవలసి వచ్చింది.
అతని కిడ్నీని మూడవసారి మార్పిడి చేసినప్పుడు అతని వయస్సు 21 సంవత్సరాలు.

ఆ తర్వాత కేవలం మూడు సంవత్సరాల అనంతరం నాల్గవసారి తన కిడ్నీ మార్పిడి చేయవలసి వచ్చింది.ఆ తర్వాత డారెన్ కిడ్నీని 30 ఏళ్ల వయసులో మార్పిడి చేశారు.డారెన్ 10 సంవత్సరాల క్రితం అమండాను వివాహం చేసుకున్నాడు.
పెళ్లికి ముందే అతను.తాను ఎప్పుడైనా చనిపోవచ్చు అని తన అనారోగ్యం గురించి అమండాకు తెలిపాడు.
అయినప్పటికీ, అమండా డారెన్ను వివాహం చేసుకుంది.డారెన్ కుటుంబ సభ్యులు అతన్ని రోబోకాప్ అని పిలుస్తుంది, అతను బతకడానికి వివిధ రకాల యంత్రాలు అవసరమని ఇలాంటి పేరు పెట్టారు.