సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ చిత్రం బయ్యర్లకు దాదాపుగా 60 కోట్ల నష్టాలను మిగిల్చినట్లుగా సమాచారం అందుతోంది.ఆ మొత్తంను కూడా చెల్లించాల్సిందే అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
రజినీకాంత్ పారితోషికం సినిమా చేసిన బిజినెస్ ఆధారంగా ఉంటుంది.అలా దర్బార్ చిత్రంతో రజినీకాంత్ ఏకంగా 100 కోట్ల వరకు పారితోషికంగా దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.
రజినీకాంత్ పారితోషికం కారణంగానే ఇప్పుడు బయ్యర్లు బలి అయ్యారు.
దర్బార్కు జరిగిన పరిస్థితి మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే రజినీకాంత్ పారితోషికం విషయంలో మార్పు చేయక తప్పలేదు.రజినీకాంత్ ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్లో శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు గాను ముందే పారితోషికం తీసుకున్నాడు.40 కోట్ల రూపాయలను ఒప్పందం చేసుకున్నాడు.దాంతో సినిమా 70 నుండి 80 కోట్ల వరకు పూర్తి అవుతుంది.అంటే సినిమా తక్కువ మొత్తానికి బయ్యర్లకు అమ్మేయవచ్చు.అప్పుడు బయ్యర్లకు నష్టాలు రావు.
రజినీకాంత్ ఏకంగా 50 నుండి 60 కోట్ల రూపాయలను దర్బార్ చిత్రం తర్వాత తగ్గించుకోవడం ఆశ్చర్యంగా ఉంది.బయ్యర్ల నష్టాల గురించి పట్టించుకోకుండా రజినీకాంత్ తాను అనుకున్నంత తీసుకోవచ్చు.కాని బయ్యర్ల శ్రేయస్సు కోసం రజినీకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
నిర్మాతకు కూడా ఇలా అయితే చాలా వరకు మేలు జరుగుతుందని అంటున్నారు.