టాలీవుడ్ క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టొరీ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.సాయి పల్లవి, నాగ చైతన్య నటించిన ఈ మూవీపై భారీ హైప్ ఉంది.
థియేటర్స్ ఎలాగూ ఓపెన్ చేసారు కాబట్టి సరైన డేట్ చూసుకొని సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీని కూడా తాజాగా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల ఏకంగా త్రిభాషా చిత్రం ప్లాన్ చేస్తున్నారు.ఈ మూవీని సునీల్ నారంగ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
శేఖర్ కమ్ముల తనకి అలవాటైన కథ, కథనంతోనే ఈ మూవీ కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ మూవీలో నటించడంపై ధనుష్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాడు.
షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ గురించి మరో హాట్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
ధనుష్ ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది.తెలుగు, తమిళ్ , హిందీ బాషలలో ఈ మూవీ తెరకెక్కుతుంది.తెలుగులో శేఖర్ కమ్ముల ఇమేజ్, తమిళం, హిందీలో ధనుష్ ఇమేజ్ ఈ చిత్రానికి వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నారు.ఈ నేపధ్యంలోనే నిర్మాతలు కూడా ఇంత భారీ మొత్తంలో ధనుష్ కి రెమ్యునరేషన్ గా ఇవ్వడానికి రెడీ అయినట్లు బోగట్టా.
రీసెంట్ గా దిల్ రాజు విజయ్, వంశీ పైడిపల్లి సినిమాని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా సుమారు ఖరారు చేశారు.ఈ మూవీ కోసం విజయ్ కి ఏకంగా 80 కోట్ల రెమ్యునరేషన్ ని ఇస్తున్నారు.ఇది ఓ విధంగా రికార్డ్ అని చెప్పాలి.ఇప్పుడు ధనుష్ కి కూడా మన టాలీవుడ్ నిర్మాతలు అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.