తమిళ హీరోలు కూడా ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా కథల పైనే ఫోకస్ పెట్టారు.తెలుగు హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా కథలతో వరుసగా సినిమాలు చేస్తున్నారు.
మహేష్ బాబు తప్ప అందరు స్టార్ హీరోలు పాన్ ఇండియా బాట పట్టారు.ముఖ్యంగా ప్రభాస్ అయితే ఇండియన్ వైడ్ గా అద్బుతమైన క్రేజ్ ఉన్న హీరోగా తన హవాని కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుతం వెయ్యి కోట్ల రూపాయిల వరకు సినిమాల ద్వారా ప్రభాస్ మీద నిర్మాతలు పెట్టుబడి పెడుతున్నారు అంటే అతని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.ఇక అతని బాటలో ఎన్టీఆర్ , తారక్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ అందరూ నడుస్తున్నారు.
ఇప్పుడు తమిళ్ హీరోలైన ఇళయ దళపతి విజయ్, హీరో సూర్య, ధనుష్ పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం నేల్స్హన్ దిలీప్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న మూవీ బీస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం. మరో వైపు దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఒక మూవీ చేయనున్నాడు.దీనికోసం ఏకంగా 80 కోట్లు రెమ్యునరేషన్ గానే విజయ్ కి దిల్ రాజు ఇస్తున్నాడు.
ఇదిలాఉంటే హీరో ధనుష్ కూడా ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళ్ బాషలలో ఒక సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు.ఇక తాజాగా మరో సినిమాని కూడా ధనుష్ కన్ఫర్మ్ చేసుకున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు.వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
సితార వారే తాజాగా వెంకీతో రంగ్ దే సినిమా చేశారు.ఇది డిజాస్టర్ అయ్యింది.
అయినా కూడా అతనికి మరో అవకాశం ఇచ్చారు.అది కూడా ఈ సారి ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే బాద్యతని అతనికి అప్పగించారు.
ధనుష్ కూడా వెంకీ చెప్పిన కథ నచ్చడంతో ఒకే చెప్పినట్లు బోగట్టా.