ఆహారాన్ని ఎప్పుడూ వేడిగా తినాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.అది నిజమే.
ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు తింటే.త్వరగా జీర్ణం అవుతుంది.
గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేర కుండా ఉంటాయి.అలాగే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
అయితే ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు తినమన్నారు కదా అని.మరీ వేడి వేడిగా ఉండే ఫుడ్స్ తింటే మాత్రం సమస్యలను ఏరి కోరి తెచ్చు కున్నట్టే అవుతుంది.
అవును, బాగా వేడిగా ఉండే ఆహారాలను తీసుకుంటే అనేక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ సమస్యలు ఏంటీ.? ఎందుకు మనల్ని ఇబ్బంది పెడతాయి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా పొత్తి కడుపు లోపల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.అందు వల్ల వేడి వేడిగా పొగలు కక్కే ఫుడ్స్ను తింటే పొత్తి కడుపు లోపల చర్మం దెబ్బ తింటుంది.
ఫలితంగా కడుపు నొప్పి, కడుపు మంట వంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.
అలాగే వేడి వేడి ఆహారాలను తినడం వల్ల టేస్ట్ బడ్స్ దెబ్బ తింటాయి.
దాంతో మీరు రుచి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అదే సమయంలో వేడి వేడి ఫుడ్ను తింటే నాలుక, నోటి చర్మం కాలి పోయి ఎర్రగా మారి పోతుంది.
అంతే కాదు, ఎక్కువ వేడి ఆహారాన్ని తినడం వల్ల పంటి ఆరోగ్య సైతం ప్రభావితం అవుతుంది.
ముఖ్యంగా వేడి ఆహారాలు దంతాల ఎనామెల్ను క్షీణించేలా చేస్తాయి.దాంతో దంతాలు బల హీనంగా మరి పోతాయి.అందుకే మరీ వేడి వేడిగా ఉండే ఆహారాలను ఎప్పుడూ తీసుకోరాదు.
గోరు వెచ్చగా ఉండే ఫుడ్స్నే తినడానికే ప్రయత్నించాలి.అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.