ఇండియాలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్నట్లు మళ్లీ డేంజర్ బెల్స్ కొన్ని రాష్ట్రాల్లో మోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా గడచిన 24 గంటల్లో 14,199 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఈ సంఖ్యతో మొత్తంగా కలుపుకుంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది.ఇదే తరుణంలో గడచిన 24 గంటల్లో 9,695 మంది మహమ్మారి నుండి కోలుకోవటం మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 1,06,99,410 కి పెరిగింది.
మరోపక్క 24 గంటల సమయంలో దేశవ్యాప్తంగా 83 మంది కరోనా కారణంగా మృతి చెందటంతో మృతుల సంఖ్య దేశవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే 1,56,385కు పెరిగింది.
ఇక యాక్టివ్ కేసుల సంఖ్య చూసుకుంటే 1,50,055.
వీరిలో కొంతమంది హాస్పిటల్లో మరికొంతమంది హోమ్ క్వారంటైన్ లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.మొత్తంగా చూసుకుంటే ఆయా రాష్ట్రాలలో కేసులు మళ్లీ పెరిగే పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో కర్ఫ్యూ విధించడాన్ని కి రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర అదే రీతిలో పూణే వంటి చోట్ల కర్ఫ్యూను మళ్లీ అమలులోకి తీసుకు వస్తున్నారు.
.