ఈ మధ్యకాలంలో సమాజంలో మహిళలపై వేధింపుల గురించి గళం విప్పేవారు ఎక్కువయ్యారు.ఒకప్పుడు అయితే చాలా మంది మహిళలు వేధింపులకి గురవుతున్న సమాజంలో చెప్పుకోవడానికి భయపడేవారు.
అయితే ప్రస్తుతం మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి వేధింపుల గురించి బయట పెడుతున్నారు.సినిమా ఇండస్ట్రీలో, అలాగే సొసైటీలో ప్రముఖ స్థానాలలో ఉన్న మహిళలు వేధింపులపై తమ గళం విప్పుతూ ఉండటంతో సామాన్య మహిళలు కూడా బయటకి వస్తున్నారు.
ఇదిలా ఉంటే చాలా కాలంగా బాలీవుడ్ లో మీటూ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.చాలా మంది హీరోయిన్లు మీడియా ముందుకి వచ్చి తమకి ఎదురైన వేధింపుల గురించి నోరు విప్పారు.
తాజాగా దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన నటి ఫాతిమా సనా షేక్ తన జీవితంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి మీడియాతో పంచుకుంది.
నేను మూడేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను.
లైంగిక వేధింపుల సమస్య చుట్టూ ఒక కళంకం ఉంది.అందుకే మహిళలు తమ జీవితాంతం వేధింపుల గురించి బయటకు చెప్పలేకపోతున్నారు.
అయితే ఇప్పుడు ప్రపంచం మారుతుందని ఆశిస్తున్నాను.చదువుకోవడం వల్ల లైంగిక వేధింపుల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది.
ప్రజలు ఈ అంశం గురించి భిన్నంగా ఆలోచిస్తారు.అందుకే నేను ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదని చెప్పుకొచ్చారు.
అదే విధంగా తను కూడా కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నానని వెల్లడించారు.అలా చేయడం ద్వారానే నాకు ఉద్యోగం లభించే ఏకైక మార్గం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.
దానికి తను ఒప్పుకోకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు తన చేయి దాటి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు
.