సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం మంచ్య తండా గ్రామములో విద్యుత్ లైన్ మెన్ సునిల్ నిర్లక్ష్యంతో శుక్రవారం సాయంత్రం పాడి ఆవు మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు.లైన్ మెన్ సునీల్ కి సమస్య ఎన్నిసార్లు చెప్పినా వినలేదని బాధితుడు గోడున విలపించారు.
బాధిత రైతు లకావత్ దేవేందర్ మాట్లాడుతూ ఎప్పటిలాగే ఆవు మేత కోసం వెళ్లగా కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి ఆవు మృతి చెందిందని వాపోయాడు.బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని ఉపసర్పంచ్ లకావత్ సత్యం డిమాండ్ చేశారు.