షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 రీసెంట్ ఎపిసోడ్లో బెంగళూరుకు చెందిన ఓ బిజినెస్ ఉమెన్ షార్క్లన్నింటికీ క్లాస్ తీసుకుంది.ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
ఆ బిజినెస్ ఉమెన్ పేరు పూనమ్ బీర్ కస్తూరి. ఆమె తన బ్రాండ్ డైలీ డంప్ కోసం నిధులు సేకరించడానికి వచ్చింది.పూనమ్ తన కంపోస్ట్ కంపెనీ గురించి షార్క్లకు తెలియజేసి 4 శాతం ఈక్విటీకి రూ.80 లక్షలు డిమాండ్ చేసింది.వంటగది వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయడం ద్వారా తోటలో లేదా వ్యవసాయంలో ఎలా ఉపయోగించవచ్చో చెప్పారు.డైలీ డంప్ కంపెనీ ప్రజలకు కంపోస్టింగ్ యూనిట్లు మరియు గార్డెనింగ్ కిట్లను అందజేస్తుంది.
ఇంతేకాకుండా పూనమ్ ప్రజలకు వారి ఇంటిలోని సేంద్రీయ వ్యర్థాలు, కూరగాయల తొక్కలు మొదలైన వాటి నుండి పోషకమైన కంపోస్ట్ను తయారు చేయడాన్ని నేర్పుతుంంటారు.దీని కారణంగా వ్యర్థాలు పేరుకుపోవు.
అలాగే చెట్లకు మరియు మొక్కలకు ఎరువులు కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదు.పూనమ్ తన కంపెనీ కాన్సెప్ట్ను వివరించినప్పుడు, ఇంట్లో దుర్వాసన వస్తుందా అని అమన్ గుప్తా అడిగారు.
ఈ సమయంలో పూనమ్ ముందుకు వెళ్లి, ఉత్పత్తిని ఎలా ఉపయోగించాలో ప్రజలకు బోధించే మాన్యువల్ను అతనికి చూపించారు.పూనమ్ బీర్ కస్తూరి శిక్షణ పొందిన పారిశ్రామిక వేత్త.
సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆమె తన వ్యాపార నమూనా ఉపయోగించాలనుకుంది.అందుకోసమే ఆమె డెయిలీ డంప్ను ప్రారంభించింది, తద్వారా ఆమె స్థిరమైన జీవనం కోసం పట్టణ ప్రజలను ఈ దిశగా ప్రేరేపిస్తున్నారు.తన సంస్థ ద్వారా, ఆమె ప్రకృతి పట్ల ప్రజలను బాధ్యులుగా మారుస్తున్నారు.డైలీ డంప్ కంపెనీ ఇంటి కంపోస్టింగ్కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తుంది.డెయిలీ డంప్ ఉద్దేశ్యం గృహాల నుండి సేంద్రీయ వ్యర్థాలను తగ్గించడం మరియు ప్రజా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడం.
పూనమ్ నవంబర్ 2009లో టెడ్ ఇండియాలో టెడ్ ఫెలోగా ఎంపికైంది.ఆమె 2016లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు చెందిన స్క్వాబ్ ఫౌండేషన్ నుండి సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది.స్మార్ట్ సిటీస్ ఇండియా అవార్డులు కూడా అందుకున్నారు.ఫండింగ్లో 4% ఈక్విటీ కోసం పూనమ్ రూ.80 లక్షల నిధులను కోరింది.పిచ్ చివర్లో నమితా థాపర్ పూనమ్కు 4 శాతానికి రూ.30 లక్షలు, 10 శాతం వడ్డీకి రూ.50 లక్షలు ఆఫర్ చేసింది.మూడేళ్ల క్రితం పూనమ్కి అవార్డు ఇచ్చానని నమిత తెలిపింది.