యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ తెలుగులో టాప్ హీరోల్లో ఒక్కడు.గతంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో రాజశేఖర్ ఢీ కొట్టేవాడు అంటే ఎంతటి క్రేజ్ ఆయనకు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తన డైలాగ్స్ను సొంతంగా చెప్పుకోలేక పోయినా, డబ్బింగ్ వేరే వారితో చెప్పించుకున్నా కూడా రాజశేఖర్ అద్బుతమైన నటనతో మెప్పించేవాడు.కాని ప్రస్తుతం పరిస్థితి మారింది.
‘గరుడవేగ’ చిత్రానికి ముందు రాజశేఖర్ దాదాపు దశాబ్ద కాలంగా సక్సెస్ లేక ఢీలా పడిపోయాడు.రాజశేఖర్ ఇక హీరోగా పనికి రాడు అని భావిస్తున్న సమయంలో గరుడవేగ చిత్రంతో సక్సెస్ను దక్కించుకున్నాడు.
ఆ సినిమా మళ్లీ ఈయనకు జీవం పోసింది.
‘గరుడవేగ’ చిత్రం సక్సెస్ అయిన నేపథ్యంలో వరుసగా సినిమాలు చేయాలని భావించిన రాజశేఖర్కు తీవ్ర నిరాశే మిగిలింది.తమిళ స్టార్ హీరో ధనుష్ ఒక భారీ చిత్రాన్ని రాజశేఖర్తో తెరకెక్కించాలని భావించాడు.అందుకోసం చర్చలు కూడా జరిగాయి.
ఆ కారణంగానే రాజశేఖర్ తన ఇతర సినిమాలను కాదనుకున్నాడు.ధనుష్ దర్శకత్వంలో మూవీ అంటే ఖచ్చితంగా ఒక మంచి సినిమా అవుతుందని, తనకు మరో మంచి విజయాన్ని ఈ చిత్రం అందిస్తుందని రాజశేఖర్ భావించాడు.
కాని అనూహ్యంగా రాజశేఖర్ను తన సినిమా నుండి ధనుష్ తప్పించాడు.రాజశేఖర్కు టాలీవుడ్లో అంత క్రేజ్ లేదు.
తన మొదటి తెలుగు సినిమాను రాజశేఖర్ వంటి సాదారణ హీరోతో చేయడం కంటే నాగార్జున వంటి స్టార్ హీరోతో చేయడం మంచిదని ధనుష్ నిర్ణయించుకున్నాడు.
చెప్పా పెట్టకుండా ధనుష్ తన ప్రాజెక్ట్ను నాగార్జున వద్దకు తీసుకు వెళ్లాడు.
రాజశేఖర్ ఈ పరిణామాలతో షాక్కు గురయ్యాడు.తన వద్దకు ధనుష్ స్వయంగా వచ్చి సినిమా చేస్తాను అంటూ అడిగితే సరే అన్నాను.
ఇప్పుడు ఆయనే తనను వదిలేసి నాగార్జున వద్దకు వెళ్లండంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.నాగార్జున ఇప్పటికే ధనుష్తో మూవీకి ఓకే చెప్పాడు.
ప్రస్తుతం నానితో కలిసి నాగార్జున నటిస్తున్న మల్టీస్టారర్ పూర్తి అయిన తర్వాత ధనుష్కు డేట్లు ఇవ్వబోతున్నాడు.ఈ సమయంలోనే రాజశేఖర్కు మరో షాక్ తగిలింది.
రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందనున్న మూవీలో రాజశేఖర్ను కీలక పాత్రకు ఎంపిక చేయడం జరిగింది.ఆ పాత్ర రాజశేఖర్ ఎంతో ఇష్టపడి ఒప్పుకున్నాడు.
ఇప్పుడు ఆ సినిమా కూడా క్యాన్సిల్ అవ్వడంతో రాజశేఖర్కు చేతిలో సినిమాలు లేకుండా ఉంది.గరుడవేగ వంటి సక్సెస్ దక్కించుకున్న రాజశేఖర్ ఆ సక్సెస్ను తనకు అనుకూలంగా మల్చుకోవడంలో విఫలం అయ్యాడు.
త్వరలోనే రాజశేఖర్ కొత్త సినిమాను ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ధనుష్ ఉన్నపలంగా రాజశేఖర్ను తప్పించడంతో ఆయన పరువు పోయిందని సినీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు.