బీజేపీ కీలక నాయకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి కుమారుడు హితేష్, భర్త దగ్గుపాటి వెనకటేశ్వరరావు వైసిఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొద్దిరోజులుగా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక కధనాలు వస్తూనే ఉన్నాయి.
కొందరు దగ్గుబాటి.వైసీపీలో చేరికను స్వాగతిస్తుండగా మరికొందరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన, వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆమె ఆవేదనకు లోనయ్యారు.
సామాజిక మాధ్యమాల్లో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
” నేను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం వాళ్లకు తెలుసా? కూతురి కంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరి కోల్పోయాను.ప్రత్యేక వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలుసా? నా తండ్రి దివంగత ఎన్టీఆర్ బలవంతంగా అమెరికా పంపిన విషయం తెలుసా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న ఈ ఎపిసోడ్లో నేను చెప్పాల్సింది ఏమీ లేదు.మళ్లీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా? 2014లో నాకు బీజేపీ టిక్కెట్ దక్కకుండా టీడీపీ కుట్ర చేసిన విషయం ఎవరికైనా తెలుసా?.రాజకీయాలకు అతీతంగా నా కుటుంబాన్ని ప్రేమిస్తాను.ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు లేవు.దయచేసి నా పిల్లలు, కుటుంబానికి సంబంధించిన సున్నితమైన .వ్యక్తిగత అంశాల జోలికెళ్లకండి” పురందేశ్వరి నెటిజన్లను కోరారు.