ప్రస్తుత బీజేపీ నాయకురాలు… కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందరేశ్వరి – రాష్ట్ర మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ రాజకీయ అరంగ్రేటం వైసీపీ నుంచి ఉండబోతున్నట్టుగా అనేక కథనాలు వినిపిస్తున్నాయి.అయితే ఎన్టీఆర్ మనవాళ్ళు అయిన ఏపీ మంత్రి లోకేష్ కి హితేష్ కి మధ్య స్నేహం చాలా స్ట్రాంగ్ గా ఉంది.
ఈ నేపథ్యంలో హితేష్ టీడీపీలో చేరుతాడని అంతా అనుకున్నారు.కానీ ప్రకాశం జిల్లా పర్చూరులో సిటింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును టిడిపి మార్చే అవకాశం లేదట.
ఈ నేపథ్యంలో… హితేష్ వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు… పర్చూరు నుంచి పోటీచేయవచ్చని తెలుస్తోంది.
దీనికి స్థానిక వైసీపీ నేతలు కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం రాజకీయాలకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు దూరంగా ఉండగా, పురందేశ్వరి బిజెపిలో ఉన్నారు.కానీ ప్రస్తుతం బీజేపీ ఏపీలో గెలిచే పరిస్థితి లేనందున హితేష్ ను వైసీపీ లో చేర్చుతున్నట్టు తెలుస్తోంది.
ఒకదశలో పురందరేశ్వరి కూడా … వైసీపీలో చేరి విజయవాడ పార్లమెంట్ బరిలో ఉంటారనే వార్తలు కూడా వినిపించాయి.కానీ ఆమెకు ఎయిర్ ఇండియా డైరెక్టర్ పదవి కట్టబెట్టి బీజేపీ అధిష్టానం ఆమెను బుజ్జగించింది.