వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎన్టీఆర్ మనవడు దగ్గుపాటి పురందరేశ్వరి – వెంకటేశ్వరావు దంపతుల కుమారుడు హితేష్ చేరడం దాదాపు ఖాయం అయిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయమై దగ్గుపాటి వెంకటేశ్వరావు క్లారిటీ ఇచ్చేసారు.
తాము వైసిపి తో కలిసి పనిచేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.ఈ రోజు లోటస్పాండ్లో జగన్తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్లు భేటీ అయ్యారు.
ఈ భేటీ అనంతరం మీడియాతో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.హితేష్కు పర్చురు టికెట్కు సంబంధించి తమకు జగన్ ఎటువంటి హామీ ఇవ్వాలేదని చెప్పారు.
ఆ పార్టీతో ఇప్పుడే ప్రయాణం ప్రారంభించామని.టికెట్ విషయం జగన్ చూసుకుంటారని… చెప్పారు.జగన్ వ్యవహారశైలిపై ఇటీవల పలురకాలుగా ప్రచారం జరుగుతోందని.కానీ తనకు అలా అనిపించలేదని దగ్గుబాటి అన్నారు.రెండేళ్ల నుంచి జగన్ బయటనుంచే పరిశీలిస్తున్నానని ఆయన చెప్పారు.వైసిపి లో ఎప్పుడు చేరేదీ త్వరలోనే క్లారిటీ ఇస్తామంటూ… లోకేష్ చెప్పుకొచ్చారు.