రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కారు ప్రమాదానికి, నా కుమారుడు దగ్గుబాటి అభిరామ్కు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ స్పష్టం చేశారు.మణికొండలోని పంచవటి కాలనీలో దగ్గుబాటి అభిరామ్ కారు యాక్సిడెంట్కు గురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అభిరామ్ కారు మరో కారును ఢీ కొట్టిందని.అభిరామ్ రాంగ్ రూట్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు మీడియాలో వస్తున్న వార్తలను అభిరామ్ కుటుంబ సభ్యులు ఖండించారు.
ఈ కారు ప్రమాద వార్తలపై స్పందించిన దగ్గుబాటి సురేష్ బాబు.మీడియాలో వస్తున్న వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని స్పష్టం చేశారు.యాక్సిడెంట్ చేసింది తన కొడుకు అభిరామ్ కాదని.మీడియాలో చూపిస్తున్న కారు దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించింది కాదని అన్నారు.
దీనిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని.వాటిని ప్రచారం చేయవద్దని సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు.