ఓటీటీ ద్వారా పరిచయం కాబోతున్న స్టార్‌ నిర్మాత తనయుడు

టాలీవుడ్‌లో దిగ్గజ నిర్మాత అయిన సురేష్‌ బాబు తనయుడు రానా ఇప్పటికే హీరోగా పరిచయం అయిన విషయం తెల్సిందే.

రానా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక స్థాయిలో స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈయన బాలీవుడ్‌ కోలీవుడ్‌లో కూడా నటించి ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం ఈయన రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు.అరణ్య అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

ఇంతగా బిజీగా ఉన్న రానా అడుగు జాడల్లోనే ఆయన తమ్ముడు అభిరామ్‌ దగ్గుబాటి కూడా హీరోగా పరిచయం అవ్వాలని ఉవ్విల్లూరుతున్నాడు.

రెండు సంవత్సరాల క్రితమే ఈయన హీరోగా పరిచయం అవ్వాలనుకున్నాడు.అయితే శ్రీరెడ్డి ఇష్యూ కారణంగా సినిమాల్లో ఎంట్రీ వాయిదా పడుతూ వచ్చింది.

అభిరామ్‌ హీరోగా పరిచయం అయిన వెంటనే శ్రీరెడ్డి రెచ్చి పోయి మళ్లీ వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని, ఆమె వద్ద ఉన్న ఇంకా కొన్ని ఫొటోలు మరియు వీడియోలను కూడా బయటకు విడుదల చేసే అవకాశం ఉందట.

అందుకే అభిరామ్‌ ఎంట్రీ విషయంలో వెనుక ముందు ఆడుతున్నారు. """/"/ ఇటీవలే అభిరామ్‌ మాట్లాడుతూ తాత బతికి ఉంటే నేను హీరో అయ్యే వాడిని అంటూ వ్యాఖ్యలు చేశాడు.

అంటే అతడికి ఎంతగా హీరో అవ్వాలనే కోరిక ఉందో అర్థం చేసుకోవచ్చు.హీరోగా పరిచయం అవ్వాలనుకుంటున్న అభిరామ్‌ మొదట వెబ్‌ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సురేష్‌ ప్రొడక్షన్‌లో ఒకేసారి నాలుగు వెబ్‌ సిరీస్‌లు నిర్మించబోతున్నారు.అందులో ఒక దాంట్లో కీలక పాత్రను అభిరామ్‌ చేయబోతున్నాడట.

వెబ్‌ సిరీస్‌ల ద్వారా గుర్తింపు దక్కించుకుని మెల్లగా వెండి తెరపై తెరంగేట్రం చేసే అవకాశం ఉందంటున్నారు.

Purandhveswari : ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి..: పురంధ్వేశ్వరి