టాలీవుడ్ స్టార్ హీరో రానా పెళ్లి కరోనా టైంలో అయినా అంగరంగ వైభవంగా జరిగింది.కాని ఎంతో మంది ప్రముఖులను మరియు బంధు మిత్రులను ఆహ్వానించలేక పోయాం అంటూ దగ్గుబాటి వారి కుటుంబ సభ్యులు ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలోనే వారు ప్రముఖుల ఇంటికి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ను పంపించి అందులో ఒక లేఖను కూడా పంపించారు.ఆ లేఖ ను సురేష్ బాబు దంపతులు రాయడం జరిగింది.
ఆ లేఖలో.మా పెద్ద కొడుకు రానా వివాహంను ఇటీవలే నిర్వహించాం.కరోనా కారణంగా పెళ్లికి మిమ్ములను ఆహ్వానించడానికి కుదరలేదు.కనుక మా ఈ యొక్క చిన్న గిఫ్ట్ ను అందుకోవల్సిందిగా కోరుతున్నాం.
ఈ సందర్బంగా మీరు మా రానా బాబును ఆశీర్వదించగలరని మనవి.మీ ఆశీర్వాదాలు కొత్త జంటకు అందించి వారి జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటారని ఆశిస్తున్నాం అంటూ అందులో పేర్కొన్నారు.
ప్రముఖులకు పంపించిన ఆ గిఫ్ట్ ప్యాక్ లో ఖరీదైన వస్తువులు ఉన్నట్లుగా తెలుస్తోంది.ప్రముఖులు పలువురు ఇంటికి ఈ ప్యాక్ వెళ్లింది.దాదాపు 300 మందికి ఈ బహుమానాలు వెళ్లాయని అంటున్నారు.మొత్తానికి దగ్గుబాటి వారు అంటే ఏం చేసినా విభిన్నంగా చేస్తారు అని సురేష్ బాబు మరోసారి నిరూపించుకున్నాడు.
ప్రస్తుతం రానా మరియు మిహీకాలు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.కరోనా లేకుంటే హనీమూన్ వెళ్లే వారు.కాని ఇప్పుడు పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు.