బిగ్ బాస్ సీజన్ 5 లో చెప్పినట్టుగానే… 5మచ్ బెటర్ పర్ఫామెన్స్ కనబరుస్తున్నారు మన సెలబ్రిటీలు.అందులో అత్యంత ఎంటర్టైనర్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఇంటి సభ్యుడు లోబో.
విభిన్నమైన వేషధారణతో తనకంటూ.ఒక్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు లోబో.
ఇకపోతే లోబోకి అత్యంత సన్నిహితుడైన బోయిన్ పల్లి దగడ్ సాయి యాదవ్. అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది.వయసులో తన కంటే పెద్దొడే ఐనా… నా సలహాలు తీసుకుంటాడని ఆయన అన్నారు.అందులో భాగంగానే బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చిన నుంచి ఏం జరిగినా లోబో పూస గుచ్చినట్టు చెప్పేవాడిని సాయి తెలిపారు.
దాదాపు 36 మంది చిన్న పిల్లల ట్రీట్ మెంట్ కి ఆర్థికంగా తామిద్దరూ కలిసి సహాయం చేశామని ఆయన ఎవరికి తెలియని రహాస్యాన్ని ఆయన రివీల్ చేశారు.ఇప్పటికీ ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి తమను కలుస్తుంటారని ఆయన అనందం వ్యక్తం చేశారు.2009 నుంచి తాము మంచి స్నేహితులమన్న దగడ్ సాయి ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు వారి మధ్య రాలేదని అన్నారు.లోబోకి హౌజ్ లో లేటుగా ఎంట్రీ దొరింకిందన్న ఆయన.అసలు బిగ్ బాస్ సీజన్ 3 లోనే అవకాశం ఇచ్చి ఉండుంటే.ఈ సమయానికి ఇండస్ట్రీలో ఒక మంచి స్థాయిలో ఉండే వారని సాయి వివరించారు.
చాలా మంది డైరెక్టర్స్ లోబోకి ఒక యూనిక్ స్టైల్ అని మెచ్చుకున్నారు.
కానీ అవకాశం మాత్రం ఎవరూ ఇవ్వలేదని ఆయన వాపోయారు.ఇండస్ట్రీ తనని నిలబెట్టలేదని కేవలం తనను నమ్ముకున్న వ్యాపారమే నిలబెట్టిందని లోబో తనకు ఎప్పుడూ చెప్తుండే వాడని దగడ్ సాయి తెలిపారు.లోబోకు తెరపై కనిపించాలని చాలా ఉండేదని దానికి మూలం బిగ్ బాస్ కి వెళ్ళడమే అని తనకు లోబో చెప్పే వాడని సాయి అన్నారు.
షో కి వెళ్ళేటపుడు కూడా నువ్వు ఉన్నవన్న ధైర్యంతోనే వెళ్తున్నానని తనకు చెప్పినట్టు సాయి తెలిపారు.
ఇండస్ట్రీ కంటే హైదరాబాద్ లోని సామాన్య ప్రజలే లోబోని తొందరగా గుర్తు పడ్తారని దగడ్ సాయి తెలిపారు.
లోబో ఇలా రోజు రోజుకూ మరింత స్థాయికి వెళ్ళాలని అందుకు తమ వంతు కృషి ఎప్పుడూ చేస్తామని ఆయన చెప్పారు.