ఆవేశంలో జరిగిన పని కాదు

యూపీలోని దాద్రీలో రెండు వారాల కిందట గోవు మాంసం తింటున్నాడనే పుకార్తో ఒక ముస్లీమును కొందరు చంపేశారు.ఇది దేశంలో సంచలనం కలిగించింది.

 Dadri Mob Killing ‘part Of Premeditated Strategy Of Bjp’-TeluguStop.com

బీహార్ ఎన్నికలు జరుగుతున్నా ఈ సమయంలో ఈ ఘటన భాజపా -ఇతర పార్టీల మధ్య చిచ్చు రేపింది.బీజేపీ, బీజేపీయేతర పార్టీలు దీని నుంచి ప్రయోజనం పొందాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ ఘటన మీద వేస్తున్న విమర్శలను తప్పించుకోవడానికి బీజేపీ నానా తిప్పలు పడుతున్నది.దీన్ని చిన్న సంఘటనగా బీజేపీ నాయకులు చిత్రీకరిస్తున్నారు.

అయితే యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ హత్యను కుట్ర అని చెబుతున్నారు.భాజపా నాయకులు ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ముస్లీమును హత్య చేశారని అన్నారు.

ఇది అప్పటికప్పుడు ఆవేశంలో చేసిన హత్య కాదని చెప్పారు.యూపీలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి భాజపా ప్రయత్నాలు చేస్తున్నాడని అఖిలేష్ అన్నారు.

గతంలో లవ్ జిహాద్, ఘర్ వాపసీ పేరుతో ప్రజల మధ్య ఘర్షణలు పెట్టే ప్రయత్నాలు చేసిందని విమర్శించారు.అఖిలేష్ ఇలా మాట్లాడుతుండగా ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ బీహార్ ఎన్నికల్లో భాజపాకు మద్దతుగా మాట్లాడుతున్నారు.

ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు.ములాయంకు నితీష్, లాలూ అంటే పడటం లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు.

వాస్తవానికి ఆయన కరడుగట్టిన భాజపా వ్యతిరేకి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube