ఎన్టీఆర్ ఆశయాలని పూర్తిగా గాలికి వదిలేసి టీడీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి బాబు రెడీ అవుతున్నాడు అని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సంచలన ఆరోపణలు చేసాడు.తాజాగా వైసీపీ పార్టీలో జగన్ సమక్షంలో చేరారు.
అతనితో పాటు అతని కుమారుడు దాడి రత్నాకర్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.ఇక చేరిక అనంతరం మీడియాతో మాట్లాడిన దాడి, టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేసారు.
తప్పులన్నీ చంద్రబాబు చేసి పక్కవాళ్ళ మీద నెట్టేయడం మొదటి నుంచి అలవాటుగా చేసుకున్నారని, గత నాలుగేళ్ల కాలంలో కూడా ఎదుగుదల కోసం ఎంతకైనా దిగాజారడానికి బాబు రెడీ అవుతారని దాడి విమర్శలు చేసారు.బాబు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి టీడీపీలో ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో మెల్లగా ఎన్టీఆర్ ఆశయాలని మట్టిలో కలిపేసి పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడానికి రెడీ అయిపోతున్నాడు అని విమర్శలు చేసారు.