మనిషి బ్రతుకు ప్రమాదాల అంచున ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే.అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండేనే కొంత వరకైనా ఈ ప్రమాదాల నుండి బయటపడవచ్చు.
లేదంటే ఊహించని ప్రమాదాలు కూడా ప్రాణాల మీదికి రావచ్చూ.ఇక ఇంటిలో గ్యాస్ అనేది ఎంత ముఖ్యం అయినదో తెలుసుగా.
దీని వల్ల ఇంటి పనులు అవుతాయి.కానీ దీనివల్లే ప్రాణాలు కూడా పోతాయి.
ప్రస్తుతం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.నారాయణపేట జిల్లా దామరగిద్దలో ఘోరం జరిగింది.ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించిన కారణంగా ఒక వ్యక్తి మరణించారు.
గ్రామంలో ఈ రోజు ఉదయం సిలిండర్ పేలడంతో ఒక్క సారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి.కాగా ఈ మంటల్లో చిక్కుకున్న కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి దశరథరావు మృతి చెందారు.
ఇకపోతే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తూ ప్రారంభించారట.