తమిళనాట భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది.గత రెండు మూడు రోజులుగా అన్ని వర్గాల ప్రజలు భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ వర్ష ప్రభావం సినిమాలపై కూడా పడటం జరిగింది.దీపావళి కానుకగా తమిళ ప్రేక్షకుల ముందుకు యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ‘తుంగవనం’ మరియు స్టార్ హీరో అజిత్ నటించిన ‘వేదాళం’ చిత్రాలు వచ్చాయి.
ఈ రెండు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది.ముఖ్యంగా ‘వేదాళం’ చిత్రం రికార్డు స్థాయిలో మొదటి రోజు కలెక్షన్స్ను రాబట్టింది.
రెండవ రోజు నుండి వర్షం ప్రభావంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
‘తుంగవనం’ చిత్రం లాంగ్ రన్లో మంచి కలెక్షన్స్ను రాబడుతుందని కమల్ భావించాడు.
కాని వర్షం ప్రభావం వల్ల కమల్ ఆశలపై నీళ్లు చట్టినట్లు అయ్యింది.భారీ అంచనాలున్న ఈ రెండు సినిమాలు మంచి కలెక్షన్స్ను మిస్ అవుతున్నాయి.
ముఖ్యంగా అజిత్ నటించిన ‘వేదాళం’ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అన్నారు.కాని ఓపెనింగ్స్ దెబ్బ తీయడంతో లాంగ్ రన్లో ఈ సినిమా 100 కోట్లను దక్కించుకోవడం అంత సులభం కాదని ట్రేడ్ పండితులు అంటున్నారు.
ఈ రెండు సినిమాలపైనే కాకుండా ఇంకా పలు సినిమా షూటింగ్స్కు కూడా వర్షం ప్రభావం ఉంది.దాంతో తమిళ సినిమా పరిశ్రమ భారీగా నష్టపోతుంది.